బాపట్ల, July 6, 2026
బీసీనవచైతన్యవేదిక,బహుజనమహాసేనవ్యవస్థాపకఅధ్యక్షుడుశీలంవెంకటేశ్వర్లుఆధ్వర్యంలోనిర్వహిస్తున్న" రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్యయాత్ర"రాష్ట్రవ్యాప్తంగాకొనసాగుతోంది.ప్రజాసమస్యలపరిష్కారం,బీసీలకుచట్టసభల్లోరిజర్వేషన్లతోకూడినప్రాతినిధ్యం,బహుజనులకురాజ్యాధికారంసాధించడమేయాత్రప్రధానలక్ష్యాలనినిర్వాహకులుతెలిపారు.ఈయాత్రలోభాగంగారాష్ట్రంలోని28జిల్లాలకలెక్టర్లు,170నియోజకవర్గాలఆర్డీవోలు,అన్నిమండలాలతహసీల్దార్లకు15డిమాండ్లతోకూడినవినతిపత్రాలనుఅందజేస్తున్నారు.
బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "ప్రజా చైతన్య యాత్ర" రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లతో కూడిన ప్రాతినిధ్యం కల్పించడం, బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే యాత్ర ప్రధాన లక్ష్యాలని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 28 జిల్లాల కలెక్టర్లు, 170 నియోజకవర్గాల ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లకు 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేస్తూ యాత్ర కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, కారంచేడు, పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమ 15 డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకుడు శామ్యూల్, మేడ వెంకట్రావు, బీసీ నవచైతన్య వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షుడు అవ్వారు తారక రామారావు, అనుభవం వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.










