మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 15
మార్టూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
మార్టూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
ఐక్యతకు పిలుపు
ఈ వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.










