బనగానపల్లె, 7 September
గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్డీఓ నరేంద్రనాథ్ రెడ్డికి, తహసీల్దార్ చంద్రశేఖర్కు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఇల్లు లేని నిరుపేదలకు మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇవ్వాలి.. సిపిఐ. ఆర్డీఓ, తహసీల్దార్కు సిపిఐ వినతి.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండలం సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓ, నరేంద్ర నాధ్ రెడ్డిగారికి తహసీల్దార్ చంద్ర శేఖర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది పేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో, పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన ప్రతి ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి మూడు సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు అర్హులైన పేదలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినప్పుడు అధికారులు దరఖాస్తులను స్వీకరించాలని , వాటిని పరిశీలించాలి కాని కొన్ని గ్రామ సచివాలయాల్లో అధికారులు అర్జీలు తీసుకోవడం లేదు తీసుకున్న తిరిగి వెనక్కి ఇస్తున్నారు ఇది సైరైన పద్ధతి కాదని సిపిఐ నాయకులు ఆర్డీవో గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పేదల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారికి గౌరవప్రదమైన నివాస వసతి కల్పించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఏ శివయ్య సిపిఐ సీనియర్ నాయకులు జి సంజీవులు సిపిఐ నాయకులు పలుకూరు లక్ష్మయ్య సుబ్బయ్య కొత్తూరు సుబ్బరాజు పాల్గొన్నారు












