ఏలూరు, 21/07/2026
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు నుంచి నరసన్న పాలెం వరకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిని, తారు రోడ్డులను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు నుంచి నరసన్న పాలెం వరకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిని, తారు రోడ్డులను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుత్తా పెదబాబు, గారపాటి బుజ్జయ్య, గరిమల చలపతి తదితరులు పాల్గొన్నారు.












