కోసం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 14
వినాయక చవితి సందర్భంగా, కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో భక్తిశ్రద్ధలతో పలు వినాయక మండపాలను సందర్శించారు. మండపాల్లో ప్రతిష్టించిన శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి విఘ్నాలు తొలగించి ప్రజలను చల్లగా చూడాలి వినాయకుడిని ప్రార్థించిన చిర్ల జగ్గిరెడ్డ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పలు వినాయక మండపాలను కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సందర్శించారు. మండపాల్లో ప్రతిష్టించిన శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు అందించిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.












