తురిమెళ్ళ గ్రామంలో ఎరువుల దుకాణం లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి, రూ. 20,000 లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మార్కాపురం జిల్లా మండలంలోని తురిమెళ్ళ గ్రామంలో రవీంద్ర కుమార్ అనే వ్యక్తికి చెందిన ఎరువుల దుకాణానికి సంబంధించి ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్, లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి, బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.
బాధితుడు రవీంద్ర కుమార్, ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. శుక్రవారం, అధికారి మహమ్మద్ తన నివాసంలో బాధితుడి నుంచి రూ. 20,000 లంచం స్వీకరిస్తుండగా, ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
అధికారులు మహమ్మద్ ను అదుపులోకి తీసుకొని, అతని కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అధికారి మహమ్మద్ విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటన వ్యవసాయ శాఖలో కలకలం రేపింది.


